Just In
- 26 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
Don't Miss!
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- News
అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వర్తమానం సినిమాకు సెన్సార్ నిరాకరణ.. రాజకీయాలు చేస్తున్నారంటూ అధికారులపై నిర్మాత ఆగ్రహం
దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనను కథా నేపథ్యంగా తెరకెక్కించిన వర్తమానం సినిమాకు సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బ్రేకులు వేసింది. అభ్యంతరకరమైన సన్నివేశాలున్నాయనే ఆరోపణలపై సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిసింది.
టాలెంటెడ్ యాక్టర్ పార్వతి తిరువోత్ ప్రధాన పాత్రలో వర్తమానం చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సిద్దార్థ శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేరళ నుంచి పీహెచ్డీ చేయడానికి ఢిల్లీలోని జేఎన్యూ క్యాంపస్కు వెళ్లిన సందర్భంగా ఆమె జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
వర్తమానం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడంపై నిర్మాత, స్క్రిప్టు రైటర్, కాంగ్రెస్ నేత ఆర్యదన్ షౌకత్ స్పందించారు. కారణాలు చెప్పకుండా సర్టిఫికెట్ నిరాకరించారని ఆయన ఆరోపించారు. ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి పంపించామని సీబీఎఫ్సీ అధికారులు చెప్పరాని పేర్కొన్నారు.

డిసెంబర్ 31వ తేదీలోపు సీబీఎఫ్సీ సర్టిఫికెట్ ఇవ్వకపోతే.. ఎలాంటి అవార్డులకు పంపడానికి వీలుండదు. కేవలం రాజకీయ కారణాలతోనే సినిమాను అడ్డుకొంటున్నారు అని షౌకత్ ఆరోపించారు.
వర్తమానం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించినట్టు బోర్డు సభ్యుడు వీ సందీప్ కుమార్ చేసిన ట్వీట్ను షౌకత్ తన ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేశారు.