Just In
- 30 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
Don't Miss!
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- News
అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రజినీకాంత్ అభిమానుల నిరసన: నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుని యూనివర్శల్ స్టార్ అయిపోయారు సూపర్ స్టార్ రజినీకాంత్. వినూత్న శైలి, విలక్షణ నటనతో కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. ఆరుపదుల వయసులోనూ ఏమాత్రం విశ్రమించకుండా సినిమాలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అస్వస్థతకు గురవడం.. తర్వాత పొలిటికల్ ఎంట్రీపై తన నిర్ణయాన్ని మార్చుకోవడం చకచకా జరిగిపోయాయి.
ఎప్పటి నుంచో రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో తన అభిమాన సంఘం 'రజినీ మక్కల్ మండ్రుం' సభ్యులతో చర్చలు జరిపిన అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారాయన. అంతేకాదు, 'డిసెంబర్ 31న పార్టీ ప్రకటన.. జనవరి 1 నుంచి ప్రారంభించబోతున్నాం' అని ఓ ట్వీట్ కూడా చేశారు.

ఆ తర్వాత కొద్ది రోజులకే అస్వస్థతకు గురయ్యారాయన. అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటికి వెళ్లిన తర్వాత పొలిటికల్ ఎంట్రీపై కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. దీనికి వాళ్లంతా అడ్డు చెప్పడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు మరో ప్రకటనను కూడా వదిలారు.
రాజకీయాల్లోకి రావడం లేదంటూ రజినీకాంత్ చేసిన ప్రకటనపై ఆయన అభిమానులు నిరాశగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. తమిళనాడు నలుమూలల నుంచి అభిమానులు చైన్నైకి తరలి వస్తున్నారు. అంతేకాదు, నగరంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆయన మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తోన్న 'అన్నత్తే'లో నటిస్తున్నారు.